స్పోర్ట్స్ మార్షల్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎస్ ఎం ఎ తైక్వాండో పోటీలు ములుగు జిల్లా కేంద్రంలో ప్రారంభం అవుతున్నాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రారంభమయ్యే ఈ పోటీలలో సుమారు 110 మంది టైక్వాండో క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు మాస్టర్ అనిల్ మాట్లాడుతూ ఈ పోటీలలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాద్, జనగాం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల నుండి టైక్వాండో క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
రేపు ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్ష్ సురభి, ఎఎస్పి సాయి చైతన్య , ఉమ్మడి వరంగల్ జిల్లా టైక్వాండో కోచ్ గణేష్ యాదవ్ తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.