వనపర్తి జిల్లా నూతన ఎస్పీ కార్యాలయ భవన సముదాయాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజని కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి,రాంమోహన్ రెడ్డి, వనపర్తి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి,జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వనపర్తికి చేరిన హోం మంత్రి మహమూద్ అలికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా హోం మంత్రిని సన్మానించారు. జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తిని చాంబర్ లో ఆశీర్వదించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్