వనపర్తిలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 7 మంది ఫిర్యాదు దారులు వచ్చారు. ఫిర్యాదు దారులతో వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు స్వయంగా మాట్లాడారు.
వారి సమస్యలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.
ప్రజావాణి కార్యక్రమంలో భూ సంబంధిత ఫిర్యాదుల 4 వచ్చాయి. అదే విధంగా భార్యాభర్తల ఫిర్యాదు ఒకటి రాగా పరస్పర గొడవల ఫిర్యాదులు రెండు ఉన్నాయి.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి