హుజురాబాద్ రజక సంఘం మండల అధ్యక్షునిగా నాగవల్లి రాజు ను నియమిస్తూ కరీంనగర్ జిల్లా రజక సంఘం అధ్యక్షుడు దుబ్బాక రమేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎల్ఐసి భవన్లో తెలంగాణ రజక సంఘాల సమితి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రజక సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అక్క రాజు శ్రీనివాస్ సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల అభివృద్ధి ధ్యేయంగా పని చేశానని తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించినందుకు జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ కి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు