వ్యర్థాలు ఎక్కడి పడితే అక్కడ వేయకూడదని, వ్యక్తిగత మరుగుదొడ్లనే ఉపయోగించాలని, తినేముందు శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విజయనగరం కోట జంక్షన్ నుంచి అయ్యకోనేరు గట్టు వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో అధికారులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఫ్లకార్డుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. మనం-మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్నిఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం అనే సామాజిక కార్యక్రమాన్నిరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు విజయనగరంలో కోట జంక్షన్ నుంచీ అయ్యకోనేరు గట్టు వరకు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆధ్వర్యంలో కొనసాగింది. ర్యాలీ లో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం పాల్గొంది.