25.2 C
Hyderabad
May 8, 2024 08: 11 AM
Slider మెదక్

సిద్ధిపేట శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదాలు

Acc-3

సిద్ధిపేట శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారు డివైడ‌ర్‌ను అతివేగంగా ఢీ కొన‌డంతో ముగ్గురు మృతి చెందారు. విష‌యం తెలుసుకున్నటూ టౌన్ CI, SIలు సిబ్బందితో చేరుకొని శవాలను మార్చురీకి తరలించడానికి ప్రయత్నిస్తుండగా అదే దిశ‌లో వ‌స్తున్న మ‌రో వాహ‌నం డీసీఎం అతివేగంగా వ‌స్తూ అదుపుత‌ప్పి వారిపైకి దూసుకొచ్చింది. దీంతో సీఐ, పోలీసుల‌కు గాయాల‌య్యాయి. ప‌ది మంది స్థానికులు కూడా అక్క‌డ గూడిగూడి ఉండ‌డంతో వారికి గాయాల‌య్యాయి. ఈ హ‌ఠాత్‌ప‌రిణామంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. డీసీఎం క‌రీనంగ‌ర్ నుంచి వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అతి వేగ‌మే ఈ ఇరు ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు. కాగా గాయ‌ప‌డిన పోలీసులు, స్థానికులు ఆసుప‌త్రిలోచికిత్స పొందుతున్నారు.

Related posts

అప్పుల కుప్ప: ఏపి రుణపరిమితి కట్టడి చేస్తున్న కేంద్రం

Satyam NEWS

జర్నలిస్ట్ భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

Satyam NEWS

వితిక చేతిలో చనిపోయిన వరుణ్

Satyam NEWS

Leave a Comment