సిద్ధిపేట శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డివైడర్ను అతివేగంగా ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్నటూ టౌన్ CI, SIలు సిబ్బందితో చేరుకొని శవాలను మార్చురీకి తరలించడానికి ప్రయత్నిస్తుండగా అదే దిశలో వస్తున్న మరో వాహనం డీసీఎం అతివేగంగా వస్తూ అదుపుతప్పి వారిపైకి దూసుకొచ్చింది. దీంతో సీఐ, పోలీసులకు గాయాలయ్యాయి. పది మంది స్థానికులు కూడా అక్కడ గూడిగూడి ఉండడంతో వారికి గాయాలయ్యాయి. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. డీసీఎం కరీనంగర్ నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి వేగమే ఈ ఇరు ప్రమాదాలకు కారణమని పోలీసులు తెలిపారు. కాగా గాయపడిన పోలీసులు, స్థానికులు ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు.
previous post
next post