రాష్ట్రం 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే మీరు వేల కోట్లకు అధిపతులయ్యారని,సీఎం కేసీఆర్కు ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘మంత్రి కేటీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశించండి. 2014లో 8కోట్లు ఉన్న కేటీఆర్ ఆస్తి 41 కోట్లకు ఎలా పెరిగింది?. టీఆర్ఎస్ విరాళాలు 188 కోట్లకు పెరగడం వెనుక రహస్యం ఏమిటి?’’ ప్రజలకు తెలుపాలని అంటూ రేవంత్ ప్రశ్నించారు.
మీరు విచారణకు ఆదేశించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్ అన్నారు.రాష్ట్రంలో ఆరాచక పాలనా సాగుతుందని ఎన్నికల్లో డబ్బు బెదిరింపులతో గెలవాలని చూడటం తప్పు అని ఆ ఉత్తరం లో పేర్కొన్నారు.