తాము 7 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యమెంటని వైద్యశాఖ ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు ప్రశ్నించారు. ఏడవరోజు నిరసనలో భాగంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్ స్కీములో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 510 జీఓను డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వర్తింపజేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఈ నిరసనలో వెంకట రమణ, వరలక్ష్మి, సంధ్య, రజియా, ప్రసన్న, అఖిల్, సిద్దార్థ, బాలకృష్ణ, స్వాతి, గీత పాల్గొన్నారు.