37.7 C
Hyderabad
May 4, 2024 13: 22 PM
Slider నల్గొండ

రాజన్న రాజ్య స్థాపనకు రాజీలేని పోరాటం చేద్దాం

#YSRCPNalgonda

దివంగత ముఖ్యమంత్రి  స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలమ్మ ఏప్రిల్ 9న, ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన  సంకల్పసభను జయప్రదం చేయాలని వైఎస్సార్ టిపి అడహక్ కమిటీ సభ్యుడు, ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాజన్న రాజ్య స్థాపనకు వైఎస్ఆర్ అభిమానులు,షర్మిలమ్మ అభిమానులు, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు రాజీలేని పోరాటం చేయాలని అన్నారు.

నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లాగా పనిచేసి  షర్మిలమ్మ సారధ్యంలో స్వర్గీయ వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో YSRTP ముఖ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వలస కార్మికులకు అండగా జన్ సహస్

Satyam NEWS

లారీ ఢీకొని కారు దగ్ధం: వ్యక్తులు నలుగురు సజీవ దహనం

Satyam NEWS

రష్యాతో రాజీ: వెనక్కి తగ్గిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ

Satyam NEWS

Leave a Comment