దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలమ్మ ఏప్రిల్ 9న, ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన సంకల్పసభను జయప్రదం చేయాలని వైఎస్సార్ టిపి అడహక్ కమిటీ సభ్యుడు, ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాజన్న రాజ్య స్థాపనకు వైఎస్ఆర్ అభిమానులు,షర్మిలమ్మ అభిమానులు, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు రాజీలేని పోరాటం చేయాలని అన్నారు.
నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లాగా పనిచేసి షర్మిలమ్మ సారధ్యంలో స్వర్గీయ వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో YSRTP ముఖ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.