30.2 C
Hyderabad
May 13, 2024 12: 08 PM
Slider ముఖ్యంశాలు

రాజన్న రాజ్యం తెస్తాo 

#sharmila

రాష్ట్రంలో రాజన్న సంక్షమే పాలన తెచ్చేందుకే పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు . మతప్రబోధకులు, వేదపండితులు షర్మిలను ఆశ్వీర్వదించారు . ఈ సందర్భంగా జరిగిన సభలో షర్మిల  మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పులి అని , తాను ఆ పులి బిడ్డనని,  మాట ఇస్తే మడమ తిప్పటం లేదన్నారు.  మీ బిడ్డగా ఆశ్వీరదించి ,ఆదరించాలని కోరారు .  రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఐదు సంవత్సరాలు పరిపాలించి ఎలాంటి పాలన అందించారో అందరికి  తెలుసునని అలంటి పాలన తిరిగి తీసుకురావాలంటే తప్పకుండ వైయస్ ఆర్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకోని రావాలని పిలుపు నిచ్చారు . పాలేరు నియోజకవర్గంలోని 180 గ్రామాలకు తాగునీరు ఇచ్చిన ఘనత స్వర్గీయ వైయస్సార్ దేనని ప్రజల హర్షద్వానాల మధ్య తెలిపారు .  తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చేసిన ఏ ఒక్క వాగ్దానం కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శయించారు . వైయస్ విజయమ్మ మాట్లాడుతూ తన బిడ్డ షర్మిల తన తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు పార్టీ పెట్టారని ఆమెను  ఆశ్వీర్వదించాలని కోరారు . ఆమె పాదయాత్రలకు భయపడిన కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తుందని అయినప్పటికీ భయపడకుండా ప్రజల సహకారం తో నిర్బంధాలను అరెస్టులను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతుందని అన్నారు.  పాలేరు లో షర్మిల పోటీ చేయడం ద్వారా ఇక నుంచి  మీ మధ్యలో ఉండబోతుందని ఆమెను ఆదరించాలని కోరారు . ఖమ్మంకు సమీపంలోని కరుణగిరి చర్చి ఎదురుగా  సుమారు ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు .ఈ కార్యక్రమంలో భారీగా జనం పాల్గొనటం విశేషం.  కాగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పాల్గొనటం చర్చగా మారింది.

Related posts

Analysis :మాయదారి చైనా మన దారికి వచ్చేనా?

Satyam NEWS

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

Satyam NEWS

దళిత కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

Leave a Comment