మిషన్ భగీరథ కార్మికులు కల్వకుర్తి మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
డివిజన్ నాయకులు హరీష్ మాట్లాడుతూ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను విరమించేది లేదని కరాకండిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మికులు తదిరులు పాల్గొన్నారు.