హైదరాబాద్ లో గల ఎస్ఆర్ఎన్ డి గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఆన్ లైన్ ద్వారా సమర్థవంతమైన ఐటి కెరీర్ కావలిసిన అర్హతలు వెబినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమంనికి ఐటి పరిశ్రమలో 35 సంవత్సరాల అనుభవం గల చంద్రమౌళి, 25 సంవత్సరాల అనుభవం గల ఐ ఎస్ పి శర్మ, అధ్యాపకుడు గా 27 సంవత్సరాల అనుభవంగల డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్ తమ అనుభవాలు పంచుకున్నారు. ముందుగా డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ అకాడమీ మరియు పరిశ్రమల మధ్య ఖాళీని భర్తీ చేయాలి.
పరిశ్రమ సిబ్బంది కళాశాల సిబ్బందితో ఎక్కువగా సంభాషించాలి. అప్పుడు కళాశాల సిబ్బంది పరిశ్రమల కావలిసిన విధంగా విద్యను చెప్పగలరు. ఐ ఎస్ పి శర్మ మాట్లాడుతూ విద్యార్థులు ఐటి లో మీ కెరీర్ను ప్రారంభించేటప్పుడు సమస్యల పరిష్కారం కావలిసిన లాజిక్స్ చాల కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రమౌళి మాట్లాడుతూ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం అని చెప్పారు. దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాల నుండి విద్యార్థులు హాజరైరారు.