వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న ఆనం రామనారాయణ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించిన ఆయన వెంకటగిరి ఇన్చార్జ్ గా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని నియమించబోతున్నారని తెలిసిందే. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో ప్రకటన రానున్నది.
‘‘ఏం చెప్పి ఓట్లు అడగాలి’’ అంటూ ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు దఫాలలో ఆనం రామనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నాయని జగన్ అభిప్రాయపడుతున్నారు. దాంతో ఆనం రామనారాయణ రెడ్డిపై వేటు వేసేందుకు జగన్ సిద్ధం అయ్యారు.