29.7 C
Hyderabad
April 29, 2024 08: 13 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో రేపు శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు

1378710_10202328412631356_886231910_n

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 27న బుధ‌వారం తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకెళ్ల‌నున్నారు. శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారాన్ని ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగిస్తారు. అనంత‌రం తిరుమల నుండి బయల్దేరి తిరుచానూరులోని పసుపు మండపానికి  తీసుకొస్తారు. ప‌సుపు మండ‌పం నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు. బుధ‌వారం రాత్రి జ‌రిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజ, గ‌రుడ వాహనాల సంద‌ర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

Related posts

అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు

Satyam NEWS

టెలిపోన్ ద్వారా స్పంద‌న‌ నిర్వ‌హించిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

సవతి పిల్లలతో కలిసి ఉండలేని మహిళ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment