27.7 C
Hyderabad
May 14, 2024 06: 16 AM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్ రోలర్స్ సమావేశం

#hujurnagarcongress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్ రోలర్స్ సమావేశం జరిగింది.

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ కమిటీ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్ హాజరై మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పట్టణంలో ఇప్పటి వరకు చేసిన సభ్యత్వాలు 10,000 లకు దాటిన సందర్భంగా నాగన్న గౌడ్ తన హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క బూత్ ఎన్ రోలర్స్ ఐదు వందల మెంబర్షిప్ పూర్తి చేయాలని, ఎంపి ఉత్తమ్ ఆదేశాలను ప్రతి కార్యకర్త పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,రాజా నాయక్,కారంగుల విజయ వెంకటేశ్వర్లు,ధనమ్మ,పట్టణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి వీరబాబు, ఉపాధ్యక్షుడు గొట్టెముక్కల రాములు, ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పోతన బోయిన రామ్మూర్తి,కంకణాల పుల్లయ్య, రెడపంగు రాము,కందుకూరి రాము, వీరబాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కొరకరాని కొయ్య: జగన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ గా మారిన కోటంరెడ్డి

Satyam NEWS

హంసల దీవి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

బియ్యం పంపిణీ చేస్తున్న గాయత్రి ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment