పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యం లో వైన్ షాపులు ఈ నెల 20 వ తేదీ సాయంత్రం నుండి మూతపడనున్నట్లు ఎన్నికల అధికారులు తెలపడం తో మందుబాబులకు చిక్కొచ్చి పడింది.తెలంగాణ లో ఎన్నికల నేపథ్యం లో అన్ని కార్పొరేషన్ ,మున్సిపాలిటీలలో మందు షాప్ లు మూసివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్ లు ఆదేశాలు జారీచేశారు.ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు మందు సరఫరా చేస్తే ఓకే లేకుంటే మూడు రోజులకు సరిపడా మందు ఎలా సమకూర్చుకోవాలని మందుబాబులు తీవ్రంగా బాదపడిపోతున్నారు.మరో వైపు చివరి మూడు రోజులే ఓట్లు దండుకోవడానికి కీలకం కావడం తో అభ్యర్థులు మందు కొని నిలువ చేసుకోవడానికి యత్నిస్తున్నారు.అయితే డబ్బు లేకుంటే మందు ఇమ్మని అభ్యర్థులపై మందు బాబు లు ఒత్తిడి తెచ్చెదుకు యత్నిస్తుండటం గమనార్హం.
previous post