నేపాల్ వాసి ఖాగేంద్ర థాపా మాగర్ మృతి చెందాడు.అయన ప్రపంచంలోనే చిన్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డుల్లోకెక్కారు. 2అడుగుల ఎత్తు మాత్రమే ఉండే మాగర్ న్యూమోనియాతో పోఖారా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. 27ఏళ్ల మాగర్ చనిపోయినట్టు కుటుంబసభ్యులు దృవీకరించారు. పుట్టినప్పుడు 600 గ్రాముల బరువు మాత్రమే ఉన్నఖాగేంద్రకు వయసు పెరిగినా ఎత్తు మాత్రం పెరగలేదు. గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న తరువాత నేపాల్ ప్రభుత్వ గుడ్విల్ అంబాసిడర్ గా కొనసాగాడు.
previous post