కాచిగూడ నుండి కార్పొరేటర్ గా అత్యధిక మెజారిటితో గెలుపొందిన కన్నెఉమా రమేష్ యాదవ్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చప్పల్ బజార్, ఇంద్రనగర్లోని వారి నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమా రమేష్ యాదవ్లు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలందించే తీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట్, బర్కత్ పుర జిల్లా అధ్యక్షులు ఎన్. గౌతమ్ రావ్, బీ.జే.పీ నగర ఉపాధ్యక్షులు కన్నెరమేష్ యాదవ్, అజయ్ కుమార్, బీ. సంతోష్ కుమార్, కృష్ణ సాగర్, సుభాష్ పటేల్, క్షీర్ సాగర్, అశోక్ కుల్కర్ణి, హజారి బాబు, శ్రీనివాస్ గుప్తా, భీమ్ రాజ్, సోమేష్, బల్వీర్, రమాదేవి, ప్రతిభా, ప్రియాంకా, దీపక్, పంకజ్, ఆసిఫ్ అలీ, బాలా ప్రసాద్, అర్వింద్ తదితరులు పాల్గొన్నారు.