తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మి ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లకు జీతాలు ఇవ్వాలనుకుంటున్నారా? అని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులు అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. లేదంటే శ్రీవారి భక్తులతో కలిసి ఉద్యమిస్తామిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలను క్రైస్తవ, ముస్లిం రాజ్యాలుగా మార్చాలనే కుట్రకు తెరతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయ కీచకుల చెర నుంచి ఆలయాలను రక్షించుకుంటామని ఆయన తెలిపారు. హిందూ వ్యతిరేక శక్తులను తరిమేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.