మూఢ నమ్మకమో, శాస్త్రీయత ఎంత ఉందో తెలియదు కానీ తాంబళంలో నీళ్లు పోసి రోకలి నిలబెడితే నిలబడ్డది. గ్రహణ సమయంలో ఇలా జరుగుతుందని పెద్దల నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గౌడ కాలనీలో ఈ ప్రయోగం చేశారు.
సూర్య గ్రహణ సమయంలో తాంబళంలో నీళ్లు పోసి అందులో రోకలి నిలబెట్టారు. గ్రహణం పట్టే సమయానికి రోకలి నిలబడింది. రోకలి ఈ విధంగా నిలబడటంతో ప్రయోగం చేసిన పెద్దలు చూశారా సూర్యుడి మహిమ అని అన్నారు. దాంతో ఈ వింతను చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.