హైదరాబాద్ లోని మియాపూర్ డివిజన్ లో నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కరోనా ప్రభావంతో సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున కొద్ది మంది మహిళలు, చిన్నారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వార్డు సభ్యురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా నోటికి, ముక్కుకు మాస్కులతోనే హాజరయ్యారు.
previous post