ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చైతన్య పరివృత క్లబ్ చెట్ల నాటడం మీద సిబిఐటి కళాశాల లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భం గా కళాశాల ప్రిన్సిపాల్ పి రవీందర్ రెడ్డి , సివిల్ విభాగ అధిపతి ప్రొఫెసర్ జగన్నాథరావు , కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎమ్ ముకుంద వాణి, సీనియర్ అధ్యాపకులు ప్రొఫెసర్ ఉమాకాంత చౌదరి, డాక్టర్ పి వి నాగ ప్రపూర్ణ, మహేశ్వర రెడ్డి, పాల శ్రీనివాస్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
పర్యావరణం గురించి తెలుసుకోవడానికి ఆన్లైన్ ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఉమాకాంత చౌదరి, డాక్టర్ పి. విజయ్ బాబు ఆక్సిజన్ ప్రాముఖ్యత గురించి చెప్పారు. మన పర్యావరణాన్ని సురక్షితమైన నివాస స్థలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, చెట్ల పెంపకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, భవిష్యత్ తరాల జీవితాన్ని సురక్షితంగా జీవించవచ్చు అని ఆయన అన్నారు మరియు ఈ సంవత్సరం థీమ్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి వారు వివరించారు.