భారతదేశ వాటికన్ రాయబారి ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ఏలూరు పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ గురువారం ఏలూరులోని బిషప్ హౌస్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి,సుభిక్షమైన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఏలూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేశారని మేయర్ నూర్జహాన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు నగర పాలక సంస్థ పాలకవర్గం, నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేయాలని ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ని మేయర్ షేక్ నూర్జహన్ పెదబాబు కోరారు.
previous post
next post