ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న తిరుమల హాస్పటల్స్ ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. యూజ్ హర్ట్ టు కనెక్ట్ అంటూ నగరంలో ర్యాలీ ఏర్పాటు చేసింది. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ దీపికా ఎం.పాటిల్ నగరంలోని కోట జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తిరుమల హాస్పటల్స్ వారు ఈ కార్యక్రమం నిర్వహించారని ఎస్పీ తెలిపారు. ఇంత వరకు సంభవించిన కరోనా కానివ్వండి..గులాబ్ తుపాను కానివ్వండి..ఏ సంఘటనకాని ఉపద్రవం కాని సంభవించిన ప్రతీ ఒక్కరి గుండె(హృదయం)భయంతో కొట్టుకుంది.
ఆ భయాన్నిప్రతీ ఒక్కరూ తొలగించాలంటే సమయానికి ఆహారం…పనిపూర్తయిపోవాలన్నారు. ఆవిధంగాప్రతీ ఒక్కరూ చేస్తే…మధుమేహం,షుగర్ వ్యాధులను అరికట్టగలిగే వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల హాస్పటల్స్ అధినేత డా.తిరుమల ప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.