పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. 23 రోజులకు గాను స్వామివారి హుండీ ఆదాయం నగదు రూపంలో 2 కోట్ల 12 లక్షల 87వేల 585 రూపాయలు వచ్చింది.
అదే విధంగా బంగారం 414 గ్రాములు, వెండి 7 కేజీల 420 గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి జి వి సుబ్బారెడ్డీ చెప్పారు.
వీటితో పాటు పాత 1000 రూపాయల నోట్లు 4 500 రూపాయల నోట్లు 42 పలు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని కూడా సుబ్బారెడ్డి వెల్లడించారు.