రాయలసీమ ఉద్యమ నిర్మాత, ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ యం.వి.రమణా రెడ్డి మరణించడం బాధాకరమని నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
రాయలసీమ అభివృద్ధి కోసం చివరి వరకు పరితపించిన ముద్దుబిడ్డ నేడు అస్తమించడం సీమ అభివృద్ధికి తీరని లోటని ఆయన అన్నారు.
ఆ మహనీయునికి నివాళి అర్పిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గొప్ప మేధావి, ఆయన జీవితమే ఒక చరిత్ర. రాజకీయనాయకుడిగా, సాహిత్య కారుడిగా ప్రారంభమైన ఆయన జీవితం నేడు ఆగిపోవడం మనందరికి ఒక తీరని లోటు అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.