రాష్ట్ర వడ్డెర కార్మొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద హంగామా చేశారు. టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బంది పై చేయిచేసుకున్నారు.
కార్పొరేషన్ చైర్మన్ ను నేను టోల్ చెల్లించాలంటారా అని సిబ్బందిపై పరుషపదజాలం ఉపయోగించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా దిగి తొలగించారు.
అడ్డగించబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. నన్నే ఆపుతావా అంటూ కోపంతో ఊగిపోయారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసువేసి విజయవాడ వైపు వెళ్లారు.
వైసీపీ నాయకుల దౌర్జన్యకర ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశం అయింది.