38.2 C
Hyderabad
April 29, 2024 20: 26 PM
Slider ప్రత్యేకం

ప్రశాంతంగా ఎన్నికలు జరగడం సంతోషదాయకం

#Nimmagadda

ఏపీ తొలిదశ పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో  జరగడం సంతోషదాయకమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా,ఉత్సాహంతో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుందని ఆయన అన్నారు.

ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో, నిబంధనలతో పనిచేయడం సంతోషాదాయకమని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల నిర్వహణ సవాల్ గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారని ఎన్నికల కమిషనర్ అన్నారు.

ఎన్నికల్లో నిస్వార్ధంగా పని చేస్తున్న పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నానని ఆయన తెలిపారు.

తొలిదశ ఎన్నికలలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీ,ఎన్నికల పరిశీలకులు పూర్తి సమన్వయంతో వ్యవహరించిన తీరు మంచి ఫలితాలు ఇచ్చిందని ఆయన అన్నారు.

రెండవ దశ ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Related posts

నరసరావుపేట టీడీపీ మినీ మహానాడు వాయిదా

Satyam NEWS

నేడు ఎలోన్ మస్క్ 51వ పుట్టిన రోజు

Satyam NEWS

ఏపీ రాజకీయ ముఖచిత్రం మార్చే సినిమా ఆర్జీవీకి లేదు

Bhavani

Leave a Comment