నేటి యువతరం రాజకీయాల్లో కాకుండా విద్యా, వైద్యం, ఉపాధి, రంగాల్లో దినదినాభివృద్ధి చెంది విజయవంతం అవ్వాలని శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మన్, రాష్ట్ర ప్రైవేటు కళాశాలల సంఘ ఉపాధ్యక్షులు సూరగౌని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని సుబ్రహ్మణ్యం హోటల్ ముందు నూతనంగా ఏర్పాటు చేసిన SM సినీమెటిక్, ఈవెంట్స్, ఫోటోగ్రఫీ స్టూడియోను రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు. యాజమాని మోసిన్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై SM సినీమెటిక్ ఫోటోగ్రఫీ స్టూడియోను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వయం శక్తితో ఎదిగేందుకు వివిధ రూపాలలో సొంత వ్యాపారం ఏర్పరుచుకోవడం సంతోషకరమని తాము ఏర్పరచుకున్న వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం సూరగౌని శ్రీనివాస్ గౌడ్ గారిని స్టూడియో నిర్వాహకులు శాలువాలతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో యువకులు అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో మత గురువు ఆషిమ్ తో కలిసి ఫాతేహా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
previous post