38.2 C
Hyderabad
May 5, 2024 22: 15 PM
Slider ముఖ్యంశాలు

ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్

#Vijayasaireddy MP

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా, విజయసాయిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్టు తాజా సమాచారం.

ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. “కరోనా పరిస్థితుల దృష్ట్యా, నాకు నేనుగా వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో ఉండడం తప్పదు. టెలిఫోన్ లోనూ అందుబాటులో ఉండను. ఏవైనా కొన్ని అత్యవసర విషయాలకు మాత్రమే సంప్రదించగలరు” అంటూ ట్వీట్ చేశారు.

Related posts

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి: ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

Satyam NEWS

5 నుంచి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన

Satyam NEWS

విలేకరి వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment