ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఒక విలేకరి వేధింపులు తాళలేక ఒక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న దారుణమైన సంఘటన ఇది. గత కొంతకాలంగా తన భర్తను ఒక విలేకరి తీవ్రంగా వేధిస్తున్నాడని ఉద్యోగి భార్య నేడు ఆరోపణ చేశారు. విలేఖరికి స్థానికంగా నాయకుల, అధికారుల అండదండలతోనే రెచ్చిపోతున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. విలేకరి వేధింపులకు అంతు పొంతు లేకుండా పోయిందని ఉద్యోగి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేకూర్చాలని ఉద్యోగి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
previous post