30.7 C
Hyderabad
May 13, 2024 02: 42 AM
Slider ప్రత్యేకం

నీతి ఆయోగ్‌ సభ్యుడిగా అర్వింద్‌  వీర్మానీ

#arvind

నీతి ఆయోగ్‌ సభ్యుడిగా ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ అండ్‌ వెల్ఫేర్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్వింద్‌ వీర్మానీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌  ఉత్తర్వులు జారీచేసింది.  ప్రధానమంత్రి ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో సభ్యులుగా వీకే సారస్వత్‌, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌, వీకే పాల్‌ ఉన్నారు. వీర్మానీ నియామకంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ఈయన 2009లో ఐఎంఎఫ్‌లో భారత ప్రతినిధిగా నియమితులయ్యారు. 2012 చివరి వరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో డాక్టరేట్‌ చేశారు.

Related posts

కార్తీక మాసం: పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం

Bhavani

మాండోస్ తుఫాన్ కు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోండి

Bhavani

భారతీయ వలసదారులకు వరాలు కురిపించబోతున్న బైడెన్

Satyam NEWS

Leave a Comment