రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్ పల్లి ఎల్ఐజీ , 3వ ఫేస్ లో నివాసం ఉండే పంపన శ్రీనివాస్ (46 ) వృత్తిరీత్యా గ్రీన్ ఫారెస్ట్ నేచురల్ ప్రొడక్ట్స్ కంపెనీలో డెలివరీ బాయ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మియాపూర్ నుంచి చందానగర్ వైపు సరుకుల డెలివరీ నిమిత్తం స్కూటీ పై బయలుదేరాడు.
ఈ క్రమంలో సితార హోటల్ ముందు డీసీఎం ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్ కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే పక్కనే ఉన్న హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు గుర్తించి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. భార్య శాంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.