తూర్పుగోదావరి జిల్లా SP M.రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పట్టణ ప్రజల భద్రత, రక్షణ పెంపొందించే నిమిత్తం, నేరాల నియంత్రణలో భాగంగా కాకినాడ పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులపై ప్రత్యేక దాడులు (స్పెషల్ డ్రైవ్) నిర్వహించారు. దీనిలో భాగంగా నగరంలో స్పెషల్ పార్టీ పోలీసు బృందాలను, పట్టణ పోలీసు స్టేషన్ ల పరిధిలో ప్రత్యేక బృందాలను విస్తృతంగా దాడులు జరిపి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులను గుర్తించి వారిని సంబంధిత పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
కాకినాడ స్మార్ట్ సిటీ అనేక ప్రాంతాలలో ముఖ్యంగా మహిళలు, పిల్లలు తిరిగే బహిరంగ ప్రదేశాలలో, మద్యం షాపుల పరిసర ప్రాంతాలలో, పాన్ షాపులలో, నగర శివారు ప్రాంతాలలో, ఇతర బహిరంగ ప్రాంతాలలో మద్యం సేవించి ప్రజా శాంతికి భంగం కలిగించే వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.