ఆసియాన్ -ఇండియా మీడియా ఎక్స్ఛేంజి లో భాగంగా 10 ఆసియా దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 20 మంది జర్నలిస్టులు ఆదివారం ఉదయం ఆదిబాట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను సందర్శించారు. ఈ సందర్బంగా జర్నలిస్టులకు TCS సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి. రాజన్న, టాటా గ్లోబల్ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మీడియా & టెక్నాలజీ బిజినెస్ విభాగం వారు స్వాగతం పలికారు.
టాటా కంపెనీ విశిష్టత, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో TCS అందిస్తున్న ఐటీ సేవలు, వార్షిక టర్నోవర్,ఉద్యోగులు సంఖ్య, హైదరాబాద్ లో ఉన్న కార్యాలయాలు, మహిళా ఉద్యోగుల సంఖ్య, భవిష్యత్ ఐటీ విస్త్రతి గురించి, ఆసియాన్ దేశాలలో చేస్తున్న కార్యకలాపముల గురించి రాజన్న వివరించారు.
అనంతరం శామీర్పేటలోని భారత్ బయోటెక్ ను ఆసియాన్ దేశాల జర్నలిస్ట్ ల బృందం సందర్శించింది. ఫార్మా రంగంలో భారత్ బయోటెక్ చేస్తున్న కృషిని, కోవిడ్ వాక్సిన్ గురించి కంపెనీ అధికారులు వివరించారు.