కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల గ్రామాన్ని మండల పరిషత్ అధికారి మహబూబ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. వైకుంఠ ధామం నర్సరీతో పాటు కంపోస్టు షెడ్డు డంపింగ్ యాడ్ తదితర పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం గ్రామంలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కేంద్రంను వెళ్లి కార్డుదారులతో రేషన్బియ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం కు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి మనిషికి మనిషికి దూరం పాటించాలన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి భయంకరమైనదని కావున ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండి తమని తాము రక్షించుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్ చంద్రభాగ అశోక్, ఉప సర్పంచ్ హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి పండరి, కారోబారి హనుమంతు, రేషన్ డీలర్ బస్వంత్ తదితరులు పాల్గొన్నారు.