ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఈరోజు ములుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మండల పరిషత్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీనీ ఆవిష్కరించారు. జిల్లా ఎంపీడీవోల సంఘం అధ్యక్షులు గోవిందరావుపేట్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన, సంఘం నాయకులు ములుగు ఎంపీడీవో ఇక్బాల్ అహ్మద్ ,వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీనివాస్, కన్నయ్య గూడెం ఎంపీడీవో ఫణి చంద్ర, వెంకటాపురం ఎంపీడీవో బాబు సమక్షంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందు నాయక్ ఓడి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ములుగు జడ్పీ సీఈవో ప్రసూన రాణి జడ్పీ వైస్ సీఈవో రమాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.