33.2 C
Hyderabad
May 4, 2024 00: 13 AM
Slider ముఖ్యంశాలు

రేప్ కేసు నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

#rape

రేప్ కేసు నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం  ములుగు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చారు. ములుగు  జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన  యాలం  ప్రవళిక  (22) పై ములుగు జిల్లా వెంకటాపురం మండలం మహితాపురం గ్రామానికి చెందిన గొంది శ్రీకాంత్ (23) అత్యాచారం చేసినట్లు ఆరోపణ వచ్చింది. ములుగు జిల్లా వాజేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. నేరారోపణ రుజువు చేయడంతో నేరస్తుడికి 10 సంవత్సరాలు  కఠిన కారాగార శిక్ష మరియు 18000 రూపాయల జరిమానా విధిస్తూ ములుగు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చారు. ఈ కేసు నేర నిరూపణలో  దర్యాప్తు అధికారిగా  సి ఐ k.శివ ప్రసాద్  (బదిలీ ) ప్రస్తుత సీఐ బి .కుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాజీడు  సి హెచ్ వెంకటేశ్వర్లు, కోర్ట్ లైసినింగ్ ఆఫీసర్ కమలాకర్ కృషి చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్. శబరిష్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మరియు ప్రస్తుత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారి టీం అభినందించారు.

Related posts

రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం అక్రమం

Satyam NEWS

పస్రా ఎటాక్:అప్పు చెల్లించమన్నందుకే దయ లేకుండా

Satyam NEWS

బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు

Satyam NEWS

Leave a Comment