30.7 C
Hyderabad
April 29, 2024 03: 56 AM
Slider మహబూబ్ నగర్

బహుజన మహిళలపై పెరిగిన అత్యాచారాలు

kollapur 11 12

బహుజన మహిళలపై అత్యాచారం చేసి చంపేసిన దుండగులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత, బలహీన వర్గాలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర గవర్నర్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆయా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.

కొల్లాపూర్ పురవీధుల గుండా సాగిన ఈ భారీ ర్యాలీ లోదుండగులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సి ఎస్ సి ఎస్ టి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Related posts

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

టీడీపీ లీగల్ సెల్ కు నూతన కార్యవర్గం

Satyam NEWS

దేశంలో ఏకైక నీతి వంత మైన నాయకుడు పవన్ కళ్యాణ్

Satyam NEWS

Leave a Comment