బహుజన మహిళలపై అత్యాచారం చేసి చంపేసిన దుండగులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో దళిత, బలహీన వర్గాలపై అత్యాచారాలు పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర గవర్నర్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆయా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
కొల్లాపూర్ పురవీధుల గుండా సాగిన ఈ భారీ ర్యాలీ లోదుండగులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సి ఎస్ సి ఎస్ టి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.