రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ సైకోలా మారి అందరినీ హింసిస్తూ.. పైశాచిక పాలన సాగిస్తున్నారని రాయచోటి నియోజకవర్గ టీడీపీ బాధ్యులు, మాజీ ఎమ్మెల్యే రమేష్ కూమార్ రెడ్డి విమర్శించారు. రాయచోటి మండలం మాధవరం పంచాయతీలోని కంచరపల్లె, వెంకటాపురం, కాటినేనివారిపల్లె, తమటంవారిపల్లె గ్రామాల్లో రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ, ఇదేం ఖర్మ.
రాష్ట్రానికి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీరాజ్యం పోయి, సంక్షేమరాజ్యం రావాలంటే టీడీపీని గెలిపించాలని సూచించారు. మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, రమణారెడ్డి, సైకం రమేష్ రెడ్డి, విశ్వనాథ, శివప్రసాద్ నాయుడు, గట్టుబాబు తదితరులు పాల్గొన్నారు.