శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్షీ ప్రేమ్ చంద్ 143వ జయంతి ఉత్సవం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ డి వి ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రముఖ కవి ప్రేమ్ చంద్ చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు.
హిందీ భాషో పాధ్యాయులు గండ్రేటి వినయ్ కుమార్, భాను షాజది మాట్లాడుతూ ప్రేమ్ చంద్ హిందీ, ఉర్దూ,భాషల లో 300 వరకు కథలు, 12 నవలలు, రెండు నాటకాలు రచించి మంచి కవిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని తెలిపారు. ఆయన సంఘసంస్కర్త అని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కరణం శ్రీహరి, బుడుమూరు అప్పలనాయుడు, తాండ్ర వెంకట రమణమూర్తి, పూజారి రవి,బలివాడప్రభాకరరావు, దాష్టిసుధామణి,బెండి శారద, గొటి వాడ సుభద్రా దేవి, పిసిని వసంతరావు, భాను షాజాది, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, తంగి పద్మావతి, బొంగు వెంకటరమణమూర్తి, కొణ పల శ్రీనివాసరావు, సిఆర్పి పంచిరెడ్డి మోహనరావు విద్యార్థులు పాల్గొన్నారు.