సంతానం కలగలేదని మనస్థాపానికి గురై ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కాకినాడ ప్రతాప్ నగర్ కు చెందిన దుర్గా లక్ష్మి(23)కు చెల్లూరు గ్రామానికి చెందిన పులవర్తి సుబ్బారావుకు 8 సంవత్సరాల క్రితం వివాహం అయింది.
అయితే వారికి ఇప్పటివరకు సంతానం కలగలేదు. ఆసుపత్రుల్లో వైద్యం చేయించినప్పటికీ సంతానం కలగకపోవడంతో మనస్థాపానికి గురైన దుర్గా లక్ష్మి ఈనెల 5వ తేదీన వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి పెదపూడి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.