నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ కు, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందికి సంబంధించిన మొత్తం 27 మంది రక్త నమూనాలను ఈనెల 20వ తేదీన సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు.
మంగళవారం మధ్యాహ్నం 27 మందికి సంబంధించిన రిపోర్టు జిల్లాకు చేరిందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. 25 మందికి కరోనా లేదని పరీక్షల్లో నిర్ధారణ అయిందని అయన తెలిపారు. పాజిటీవ్ వచ్చిన ఇద్దరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించాలని జిల్లా వైద్యాధికారికి, ఆసుపత్రి సూపరింటెండెంట్ కు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.