ఇవిఎం స్ట్రాంగ్ రూం వద్ద 24 గంటల పటిష్ట బందోబస్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి, వైరా సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఏర్పాటుచేసిన వైరా నియోజకవర్గ ఇవిఎం స్ట్రాంగ్ రూంను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ బ్యారికేడ్లు, సిసి కెమెరాల ఏర్పాటును పరిశీలించారు. ఏర్పాటు చేసిన ప్రతి సిసి కెమెరా పనిచేయునట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 24 గంటల పోలీస్ పహారా ఉండాలన్నారు. తహసీల్దార్ ప్రతిరోజూ స్ట్రాంగ్ రూమ్ సందర్శించి, భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వైరా రిటర్నింగ్ అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు తదితరులు వున్నారు.
previous post