భగవంత్ సింగ్ మాన్ సారథ్యంలోని పంజాబ్ సర్కార్ తొలి క్యాబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మాన్ ఆధ్వర్యంలో తొలి క్యాబినెట్ సమావేశం శనివారం జరిగింది.
రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామంటూ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా ‘ఆప్’ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 25,000 ఉద్యోగాల్లో పంజాబ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లోని 15,000 ఖాళీలను భర్తీ చేయాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది.