ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న వారికి జీవో 58, 59 ప్రకారం క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేసి, ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ జీవో నెం. 58, 59 దరఖాస్తుల పరిష్కారం పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవో 58 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
జీవో 59 క్రింద దరఖాస్తులకు డిమాండ్ జారీ చేసినట్లు, డిమాండ్ మేరకు దరఖాస్తుదారుల నుండి వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. 91 మంది దరఖాస్తుదారులకు రూ. 15437265 చెల్లింపుకు డిమాండ్ జారీచేయగా, 43 దరఖాస్తులకు గాను రూ. 5073630 వసూలు అయినట్లు ఆయన తెలిపారు. మిగులు డిమాండ్ వసూళ్లకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డి. మధుసూదన్ నాయక్, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నార