కడప జిల్లా నందలూరు మండలం నల్లతిమ్మాయి పల్లి పంచాయతీలో 600 మాస్క్ లను గ్రామపంచాయతీ ప్రజలకు జిల్లా వైసీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గీతాల నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆదేశాల మేరకు కరోనా వైరస్ ను అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈరోజు మాస్క్ లను ఇచ్చామని తెలిపారు.
నందలూరు మండలం లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్న స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రసాద్ రెడ్డి కి, మండల పోలీస్ సిబ్బందికి, మండల వైద్యాధికారిణి డాక్టర్ సృజన వారి ఆరోగ్య సిబ్బంది ని ఆయన అభినందించారు. దయచేసి ప్రజలెవరూ ఇళ్లల్లో నుండి బయటకు రావద్దని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి సీనియర్ నాయకుడు జెసిబి సుబ్బారెడ్డి, నల్ల తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.