సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 17వ వార్డు నందు covid -19 పరీక్షా శిబిరాన్ని హుజుర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవికుమార్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అర్చన మాటాడుతూ కరోనా 2nd వేవ్ ముప్పు నుండి మనని మనం కాపాడుకునేందుకు మాస్క్ ను తప్పని సరిగా ఉపయోగించాలని, 45 సంవత్సరాల పైబడిన వయస్సు గల వారు తప్పని సరిగా ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్య కేంద్రంలో అందించే టీకాను తప్పని సరిగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు,TRSKV నియోజవర్గ కార్మిక సంఘం అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ, లలిత, శ్రవణ్, సైదులు, మూసంగి శ్రీను, ఆశ కార్యకర్తలు నిర్మల, జ్యోతి, సుశీల తదితరులు పాల్గొన్నారు.