కడప జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకం చేస్తున్న గంజాయి స్మగ్లర్ల పై పోలీసుల దాడులు చేశారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 22 కేజీల 400 గ్రాముల గంజాయి ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అన్బు రాజన్ వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పపడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బు రాజన్ హెచ్చరించారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి గంజాయి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అడిషనల్ ఎస్పీ తుషార్ డూడీ, సీఐ, ఎస్ఐలను వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ అభినందించారు.