సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 70వ,వర్ధంతి పురస్కరించుకొని స్థానిక కన్యకా పరమేశ్వరి భవన్ (సత్రం)లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య నేతలు మాట్లాడుతూ మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న,బులుసు సాంబమూర్తి గృహంలో నిరాహారదీక్ష ప్రారంభించారని, మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపిందని అన్నారు.
ఆంధ్ర కాంగ్రెసు కమిటీ దీక్షను సమర్ధించలేదని, ప్రజలు మాత్రం పొట్టి శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు,ప్రదర్శనలు జరిపారని, ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదని,చివరికు 1952 డిసెంబర్ 15న,అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యారని, ఆగ్రహోదగ్రులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారని, మద్రాసులో జరిగిన పొట్టి శ్రీరాములు అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారని అన్నారు.ఆతదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు,హింస చెలరేగాయని,పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారని,చివరకు డిసెంబర్ 19న, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఓరుగంటి నర్సింహా రావు,ప్రధాన కార్యదర్శి పొలిశెట్టి లక్ష్మినర్సింహా రావు,ఉపాధ్యక్షుడు వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరావు, ఓరుగంటి మట్టయ్య,ఏలూరి రాంబాబు, గుండా శ్రీనివాస్,మాశెట్టి గణేష్ ,గుండా సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్